తెలంగాణ

telangana

Drugs Parcel Cyber Crime : 'నీ పేరుతో డ్రగ్స్ పార్సిల్ వచ్చింది.. నేనడిగినంత డబ్బివ్వకపోతే జైలుకు పంపుతా'

By

Published : Aug 2, 2023, 12:00 PM IST

Drugs in Your Parcel Fake Customs officer call fraud in Hyderabad : డ్రగ్స్‌ పార్సిల్‌ వచ్చిందంటూ భాగ్యనగరానికి చెందిన ఐటీ ఉద్యోగినికి సైబర్‌ నేరగాళ్లు చుక్కలు చూపించారు. పార్సిల్ విషయం పోలీసులకు తెలియకుండా, కేసు నమోదవ్వకుండా చూస్తామంటూ అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్పు చేయించి రూ.19.94 లక్షలు దోచేశారు. తీరా ఇదంతా జరిగాక బూటకమని తెలుసుకున్న బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

cyber crime
cyber crime

Drugs Parcel Cyber Crime in Hyderabad : హైదరాబాద్​ నగరంలో సైబర్​నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్​ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ.. కస్టమ్స్, సీబీఐ అధికారులమంటూ నమ్మించి ఏకంగా అప్పుచేయించి మరి.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటువంటి సైబర్ ​నేరాల్లో మోసపోతున్నవారిలో ఎక్కువగా చదువుకున్నవారే ఉండటం గమనార్హం.

Fake Customs officer call fraud in Hyderabad :నగరంలోని బండ్లగూడకు చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగిని(31)కి జులై 26న అపరిచిత మహిళ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. స్మిత పేరుతో పరిచయం చేసుకున్న మహిళ.. మీ పేరిట మలేసియాకు పంపిన పార్సిల్‌ ముంబయికి తిరిగొచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తెలిపింది. ఆ డ్రగ్స్ పార్సిల్​తో తనకు సంబంధం లేదని యువతి చెప్పినా వినలేదు. అనంతరం ముంబయి కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని గూగుల్‌ మీట్‌ ద్వారా లైన్ కలిపింది.

ముంబయి కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ భయపెట్టిన నిందితుడు యువతి ఆధార్‌ కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆధార్‌ ఐడీ పరిశీలించగా హవాలా లావాదేవీల కేసుతో సంబంధముందని.. బ్యాంకు లావాదేవీలు తనిఖీ చేస్తామంటూ అకౌంట్ నంబరు తీసుకున్నారు. అనంతరం సీబీఐ ఆఫీసర్ పేరిట మరో వ్యక్తి వీడియోకాల్‌లోకి వచ్చాడు. మీ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని.. మొత్తం కుటుంబం జైలు పాలు అవుతారని బెదిరించాడు.

మూడేళ్లు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలంటూ భయపెట్టాడు. అప్పటికప్పుడు యువతితో బ్యాంకు యాప్‌ ద్వారా రూ.19.94 లక్షలు రుణానికి దరఖాస్తు చేయించారు. డబ్బు మంజూరు కాగానే తాను చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని చెప్పాడు. హైదరాబాద్‌ సీబీఐ అధికారులు 10 నిమిషాల తర్వాత మీ ఇంటికొస్తారని.. డ్రగ్స్‌ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని ఒప్పందం చేసుకుంటారని నమ్మించాడు.

ఇదంతా నిజమేని అనుకున్న యువతి 19.94 లక్షలు రూపాయాలు నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. దాదాపు మూడు గంటలు ఫోన్లో వీడియోకాల్ మాట్లాడిన నిందితులు.. డబ్బులు జమకాగానే కాల్‌ కట్‌ చేశారు. అనంతరం యువతి తనకు ఇంటికీ సీబీఐ బృందం వస్తారనుకుని ఎంతసేపు ఎదురుచూసినా.. రాకపోవడంతో సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయినట్లు గ్రహించింది. సైబారాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details