తెలంగాణ

telangana

దేశంలో తగ్గిన కరోనా కొత్త కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు

By

Published : Feb 4, 2022, 9:36 AM IST

COVID CASES IN INDIA: భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరో 1,49,394 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,072 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid
కరోనా

Covid cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,49,394 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,072 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,46,674 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 5,00,055
  • యాక్టివ్ కేసులు:14,35,569
  • మొత్తం కోలుకున్నవారు:4,00,17,088

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,65,159 మందికి కరోనా సోకింది. 11,310 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 38,82,54,530 కు చేరగా.. మరణాల సంఖ్య 57,30,459 కు పెరిగింది.

  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.74 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 264 మంది చనిపోయారు.
  • US Corona Cases: అమెరికాలో కొత్తగా 2.55 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,376 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 2,86,050 మందికి వైరస్​ సోకగా.. 923 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
  • జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2.40 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 186 మంది మృతి చెందారు.

ఇవీ చూడండి:కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. పెరిగిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details