తెలంగాణ

telangana

తమిళనాడులో ఆందోళనకర స్థాయిలో కరోనా

By

Published : May 25, 2021, 10:17 PM IST

దేశంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా.. పలు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. తమిళనాడులో 34 వేల కొత్త కేసులు వచ్చాయి. దిల్లీలో మంగళవారం మరో 156 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 1,568 మంది కరోనా బారినపడ్డారు.

corona cases in states
కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గముఖం పడుతోన్న వేళ పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 29,803 కేసులు నమోదయ్యాయి. 177 మంది చనిపోయారు.
  • మహారాష్ట్రలో మరోసారి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 24,136 మందికి వ్యాధి సోకింది. మరో 601 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 22,758 వైరస్ కేసులు బయటపడ్డాయి. 588 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటికీ పాజిటివిటీ రేటు 21.13 శాతంగా ఉంది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 3,957 కరోనా కేసులు వెలుగుచూశాయి. 163 మంది చనిపోయారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 3,404 మందికి కరోనా సోకింది. మరో 105 మంది కొవిడ్​కు బలైయ్యారు.
  • దిల్లీలో మంగళవారం మరో 156 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 1,568 మంది కరోనా బారినపడ్డారు.

20 కోట్లు డోసులు..

దేశంలో ఇప్పటివరకు 20 కోట్ల మందికి కొవిడ్‌ టీకాలు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. 20,04,94,991 కోట్ల వ్యాక్సిన్లను వేసినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా వేళ విహారమా? ఈ దేశాల్లో సాధ్యమే!

ABOUT THE AUTHOR

...view details