తెలంగాణ

telangana

బిహార్​లో మరోసారి కల్తీ మద్యం కలకలం.. ముగ్గురు మృతి.. పలువురికి అస్వస్థత

By

Published : Jan 23, 2023, 7:34 AM IST

Updated : Jan 23, 2023, 9:36 AM IST

2 died, dozens ill after liquor consumption in Siwani bihar

బిహార్​లో కల్తీ మద్యం మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ మద్యం తాగి ముగ్గురు మరణించగా.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.

బిహార్​లో కల్తీమద్యం మరోమారు కలకలం రేపింది. సివాన్​ జిల్లాలో కల్తీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఏడుగురు అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యారు. శవపరీక్ష తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మందిని అరెస్టు చేశారు. సివాన్‌లోని నబీగంజ్‌లోని బాలా గ్రామానికి చెందిన జనక్ ప్రసాద్, నరేష్ బీన్ రాత్రి సమయంలో కడుపునొప్పి ప్రారంభమైంది. దాంతో పాటు వారి కంటి చూపు కూడా మందగించింది. దీంతో వారి బంధువులు సివాన్​లోని సదర్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతులను నరేష్ బీన్, జనక్ ప్రసాద్, రమేష్ రావత్​గా గుర్తించారు.

ఆస్పత్రిలో క్షతగాత్రులు
ఆస్పత్రి వద్ద

2016 ఏప్రిల్‌లో నీతీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బిహార్‌లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించారు. అయినప్పటికీ మద్యం విక్రయాలు ఆగడం లేదు. అనేకమంది అక్రమంగా విక్రయిస్తున్నారు. 2021 డిసెంబర్​​లో ఛప్రాలోని సరన్ జిల్లా నకిలీ మద్యం సేవించడం వల్ల 75 మందికి పైగా మరణించారు. ఈ ఘటన అసెంబ్లీలో రాజకీయ దుమారాన్ని రేపింది, నకిలీ మద్యం మరణాలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నాయకులు బలమైన దాడికి దిగారు.

అయితే ఈ కల్తీ మద్యం విక్రయాలు సరన్​లోని మష్రక్, మధుర, ఇసువాపుర్, అమ్నౌర్ ప్రాంతాలలో మాత్రమే జరిగాయి. ఇప్పుడు సివాన్​లో కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మానవ హక్కుల కమీషన్​ కూడా ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది. గ్రామంలోనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. దాంతో పోలీసులు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. దీనిలో అధికారులు పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ప్రయాణికురాలిపై టీటీఈ అత్యాచారం.. కదులుతున్న రైలులో మరో వ్యక్తితో కలిసి..

రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన డంపర్​.. ఆరుగురు మృతి

Last Updated :Jan 23, 2023, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details