ప్రయాణికురాలిపై టీటీఈ అత్యాచారం.. కదులుతున్న రైలులో మరో వ్యక్తితో కలిసి..

author img

By

Published : Jan 22, 2023, 11:02 PM IST

railway-tte-raped-passenger-in-up-with-accomplice

ప్రయాణికురాలిపై అత్యాచారం చేశాడు రైల్వే టీటీఈ. కదులుతున్న రైలులో మరోవ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ దారుణం జరిగింది. మరోవైపు కోతుల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మేడపై నుంచి జారి పడి చనిపోయాడు. ఇదీ ఉత్తర్​ప్రదేశ్​లోనే జరిగింది.

కదులుతున్న రైలులో ప్రయాణికురాలి(33)పై సామూహిక అత్యాచారం జరిగింది. మరో వ్యక్తితో కలిసి రైల్వే టీటీఈ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొదట మహిళను ఏసీ కోచ్​లోకి పంపించిన టీటీఈ.. అనంతరం తన సహచరునితో కలిసి అఘాయిత్యం చేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని సంభల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబేదార్‌గంజ్ ఎక్స్‌ప్రెస్​లో ఈ దారుణం జరిగింది. నిందితుడిని రాజు సింగ్​గా పోలీసులు గుర్తించారు. ఘటనపై బాధితురాలు శనివారం.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజు సింగ్​ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరొక నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

వ్యక్తి ప్రాణం తీసిన కోతులు:
కోతుల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మేడపై నుంచి జారి పడి చనిపోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా చనిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ విషాదకర ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అలీగఢ్​​ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 50 ఏళ్ల మజీద్​గా గుర్తించారు. మేడపైన పిల్లలు ఆడుకుంటూ ఉండగా దాదాపు 20కి పైగా కోతులు వారిపై దాడి చేయబోయాయి. దీంతో మజీద్ ఓ కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆగ్రహంతో కోతులన్ని ఒక్కసారిగా మజీద్​ మీదకు వచ్చాయి. వాటిని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మజీద్​ పైనుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మజీద్​.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంటుందంటున్నారు స్థానికులు. వాటి నుంచి రక్షణ కల్పించాలని ప్రజా పతినిధులను కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.