పాదచారులు, కారుపైకి దూసుకెళ్లిన డంపర్​.. ఆరుగురు మృతి.. మరో ప్రమాదంలో ఐదుగురు..

author img

By

Published : Jan 23, 2023, 7:06 AM IST

Updated : Jan 23, 2023, 10:15 AM IST

unnao road accident

రోడ్డు దాటుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది ఓ డంపర్​. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న మారుతీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటన రాజస్థాన్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కన ఆగి ఉన్న మారుతీ కారును ఢీకొట్టి కొంత దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు. దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. ఒక్కసారిగా ఘటనాస్థలిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆదివారం రాత్రి కాన్పుర్​-లఖ్​నవూ హైవేపై జరిగిందీ ప్రమాదం. మృతులను శంకుతల, శివానిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు తల్లీకూతుళ్లు. మరోవైపు డంపర్​లో ఇరుకున్న కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. అందులో విమలేశ్​ కుమార్​, అతని కుమారుడు శివాంక్​, అల్లుడు పూరణ్ దీక్షిత్ ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

unnao road accident
మారుతీ కారును ఢీకొట్టిన డంపర్

ట్రక్కు-కారు ఢీ.. ఐదుగురు మృతి..
రాజస్థాన్ సికార్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, స్విఫ్ట్​ కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ హరియాణాకు చెందినవారని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఫతేపుర్​-సల్సార్​ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన.

ఐదుగురు యువకులు మృతి..
లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కేరళ.. అలప్పుజలోని అంబాలప్పుజలో జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఉత్సవంలో అపశ్రుతి..
తమిళనాడు.. అరక్కోణంలోని ఆలయ ఉత్సవంలో అపశ్రుతి జరిగింది. క్రేన్​ కుప్పకూలి నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. మృతులను భూబాలన్(40), జ్యోతిబాబు(16), ముత్తుకుమార్​(39), చిన్నస్వామి(85)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించామని పోలీసులు తెలిపారు. ఆలయ ఉత్సవాల్లో క్రేన్​ను ఉపయోగించేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

unnao road accident
కుప్పకూలిన క్రేన్
Last Updated :Jan 23, 2023, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.