తెలంగాణ

telangana

అయోధ్య రామాలయం ప్రాంతానికి శిలల తరలింపు

By

Published : Oct 10, 2020, 11:18 AM IST

రామమందిర నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేకంగా చెక్కిన శిలలను కార్యస్థలం నుంచి.. ఆలయ నిర్మాణ ప్రాంతానికి తరలించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ట్వీట్​ చేసింది.

Carved stones being moved from workshop for construction of Ram Temple
అయోధ్య రామాలయ ప్రాంతానికి శిలల తరలింపు

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రామ మందిర నిర్మాణంలో వాడేందుకు ప్రత్యేకంగా చెక్కిన శిలలను కార్యస్థలం నుంచి నిర్మాణ ప్రాంతానికి తరలిస్తున్నారు. పూజారులు శుక్రవారం.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ శిలల తరలింపు ప్రారంభమైంది. ముందుగా వీటిని ఆలయ పరిసరాల ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఆలయంలోని వివిధ భాగాల్లో అమర్చుతారు.

శిలల తరలింపు

రామాలయ మ్యాప్​ అనుమతి కోసం అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 29న అయోధ్య అభివృద్ధి సంస్థ (ఏడీఏ)కు సమర్పించారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు. అనంతరం.. మ్యాప్​ను సెప్టెంబర్​ 2న ఏకగ్రీవంగా ఆమోదించింది ఏడీఏ.

తరలింపు ప్రక్రియకు ముందు పూజలు
అయోధ్య రామాలయ ప్రాంతానికి శిలల తరలింపు

ఇదీ చూడండి:'రాముని అడుగుజాడల్లో నడిస్తే అభివృద్ధి తథ్యం'

2020 ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ABOUT THE AUTHOR

...view details