తెలంగాణ

telangana

దిల్లీలో మరో అగ్నిప్రమాదం- ముగ్గురు మహిళలు మృతి

By

Published : Dec 14, 2019, 10:38 PM IST

Updated : Dec 14, 2019, 11:12 PM IST

దిల్లీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. షాలిమార్​బాగ్​లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.

3-women-dead-4-injured-as-fire-breaks-out-in-house-in-delhi
దిల్లీలో మరో అగ్నిప్రమాదం- ముగ్గురు మహిళలు మృతి

దిల్లీలో మరో అగ్నిప్రమాదం

దిల్లీలోని షాలిమార్​బాగ్​ ప్రాంతానికి చెందిన ఓ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... గంట సేపు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

దిల్లీలో ఇటీవలి కాలంలో అగ్నిప్రమాద ఘటనలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల ముందే.. అనాజ్​ మండీలోని ఓ కర్మాగారంలో మంటలు చెలరేగి 43మంది మృతిచెందారు. మరో 62మంది తీవ్రంగా గాయపడ్డారు.

Last Updated : Dec 14, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details