కశ్మీర్- పుల్వామాలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాద అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఈ ముగ్గురినీ.. దక్షిణ కశ్మీర్ జిల్లా అవంతిపురలో అరెస్ట్ చేశారు.
పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద సహాయకులు అరెస్ట్
పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద అనుచరులు అరెస్టయ్యారు. హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన తీవ్రవాదులకు వీరు సాయం చేస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద సహాయకులు అరెస్ట్
అరెస్టయిన వారిని ఆదిల్ రసూల్, రియాజ్ అహ్మద్, మహ్మద్ ఇసాక్ భట్గా గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురూ త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. వారి కార్యకలాపాలకు సాయపడుతున్నారని అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధరణ కమిటీ నివేదిక
Last Updated :Mar 9, 2020, 11:40 PM IST