తెలంగాణ

telangana

Article 370 Supreme Court : ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 4:30 PM IST

Updated : Sep 5, 2023, 5:25 PM IST

article-370-supreme-court-reserves-verdict
article-370-supreme-court-reserves-verdict

Article 370 Supreme Court Reserves Verdict : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.

Article 370 Supreme Court Reserves Verdict :జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై 16 రోజుల పాటు వాదనలు ( Article 370 Hearing Today ) ఆలకించింది. అన్ని పక్షాలు తమ వాదనలు తెలియజేసిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​ ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సీనియర్ అడ్వొకేట్లు హరీశ్ సాల్వే, రాకేశ్ ద్వివేది, వీ గిరి.. ఆర్టికల్ 370కి మద్దతుగా వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణియం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే సైతం కోర్టు ముందు వాదించారు. ఈ వాదనలు పూర్తైన నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. లిఖితపూర్వక సమర్పణలకు వాదప్రతివాదులకు మూడు రోజుల సమయం ఇచ్చింది. అఫిడవిట్లు రెండు పేజీలకు మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Article 370 Of Indian Constitution :2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370వ అధికరణను కేంద్రం రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జమ్ము కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకొచ్చిన జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టం చెల్లుబాటును సైతం ప్రశ్నించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం పార్లమెంట్​కు లేదని న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆర్టికల్-370ని రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి రద్దు చేయలేదని పేర్కొన్నారు. దాన్ని రద్దు చేయడం రాజ్యాంగ సభ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. పార్లమెంట్.. రాజ్యాంగ సభ కాజాలదని వాదించారు. రాజ్యాంగ పరిధిలోకి వచ్చే సంస్థలకు అధికారాలు పరిమితంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా.. ఆర్టికల్ 370ని రద్దు చేయలేమా అని ప్రశ్నించింది. అలాగైతే.. రాజ్యాంగంలో కొత్త కేటగిరీని చేర్చినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.

'రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా'
మరోవైపు, జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ లోన్.. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2018లో కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ జిందాబాద్ అని ఆయన నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో దేశ రాజ్యాంగం, సార్వభౌమత్వానికి విధేయత ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ తాను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేశానని అఫిడవిట్​లో పేర్కొన్నారు.

Jammu Kashmir Election : 'జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు.. తుది నిర్ణయం వారిదే'

ఉమ్మడి పౌరస్మృతితో లాభమా నష్టమా? టార్గెట్ వారేనా? గిరిజనుల మాటేంటి?

Last Updated :Sep 5, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details