తెలంగాణ

telangana

పడవ మునక- ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

By

Published : Dec 2, 2020, 7:18 PM IST

మధ్యప్రదేశ్​లో జరిగిన పడవ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

5 members of the same family died after a boat capsizes in Tiller Dam of Agar Malwa
పడవ మునక: ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్​ అగర్ మాల్వా ప్రాంతంలోని తిల్లర్ డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.

సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో పడవ తలకిందులైందని అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయినట్లు చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్న మిగితావారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details