ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతి

By

Published : Jan 11, 2023, 4:06 PM IST

movie ticket prices
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు గుడ్‌న్యూస్

AP government is good news for film makers: 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌‌కి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. రెండు సినిమాలకు టికెట్ల ధర పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP government is good news for film makers: సంక్రాంతి పండుగ సందర్భంగా తమ అభిమానులను అలరించడానికి ఈ నెల 12వ తేదీన నటసింహం నందమూరి బాలకృష్థ నటించిన 'వీరసింహారెడ్డి', 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌.. 'వీరసింహారెడ్డి' టికెట్‌ ధర రూ.40కి, వాల్తేరు వీరయ్య' టికెట్‌ ధర రూ.45కి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి టికెట్ ధర రూ.20, వాల్తేరు వీరయ్య టికెట్‌ ధర రూ.25కు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలుత రూ.45 వరకు పెంచేందుకు అనుమతిస్తూ అధికారులు దస్త్రం సిద్ధం చేసినప్పటికీ.. చివరి నిమిషంలో ప్రతిపాదిత టికెట్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details