ETV Bharat / state

పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది - ఎవరైనా గొడవలు సృష్టిస్తే వదిలేది లేదు: ఎస్పీ - SP Bindumadhav Press Meet

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 10:14 PM IST

SP Bindumadhav Press Meet on Situation in Palnadu District: పల్నాడులో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయి. ఎన్నికల అనంతరం దాడులు, హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.

sp_bindumadhav_pressmeet
sp_bindumadhav_pressmeet (Etv Bharat)

SP Bindumadhav Press Meet on Situation in Palnadu District: పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ముగ్గురుకు మించి జనం గుమిగూడినా సమావేశాలు, సభలు నిర్వహించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కారంపూడిలో పిన్నెల్లి, గురజాల నియోజకవర్గం కొత్తగణేషునిపాడులో కాసుమహేశ్‌రెడ్డి హల్‌చల్‌ చేయడంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఓడిపోతున్నామని తెలిసే వైఎస్సార్​సీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: వర్ల రామయ్య - TDP Leaders Complain to Governor

SP Bindumadhav: పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. జిల్లాలో రెండు రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరిగాయని అన్నారు. గొడవలపై కేసులు నమోదు చేశామని అందుకు గల కారకులను గుర్తించామని తెలిపారు. మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లిలో కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. జిల్లాలో మరికొన్ని రోజులు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరినీ వదిలిపెట్టమని ఎస్పీ బిందుమాధవ్‌ హెచ్చరించారు.

కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లో 12వందల మంది పోలీసుల్ని నియమించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని గృహనిర్భందం చేశారు. పట్టణంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు నియమించారు. మాచర్లకు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలో అల్లర్లపై ఈసీ సీరియస్​- సీఎస్‌, డీజీపీకి సమన్లు జారీ - EC Issued Summons to AP CS and DGP

నరసరావుపేటలోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తెలుగుదేశం అభ్యర్థి అరవింద్‌బాబుతోపాటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహనిర్బంధించారు. వారి ఇళ్లవద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. నరసరావుపేటలోనే నివాసం ఉంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిని సైతం గృహనిర్బంధించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసుల ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వాహనానికి అడ్డునిలిచిన గ్రామాస్తులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే అరెస్ట్‌లు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ విచారణలో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సర్ది చెప్పారు. నకరికల్లు స్టేషన్​కు తీసుకెళ్లి, సంతకాలు చేయించుకుని బాజిని పంపించివేయడంతో వివాదం సర్దుమణిగింది.

'గొడవలొద్దు - రాజకీయ నాయకుల కోసం మీరు నష్టపోకండి' - పల్నాడు కుర్రోళ్లకు సోషల్​ మీడియాలో ఓ వ్యక్తి సందేశం - Good Message to Palnadu People

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.