తెలంగాణ

telangana

సైబర్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు అరెస్టు- రూ.10 కోట్ల మేర స్వాహా - Police arrested cyber criminals

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 10:43 PM IST

Police Arrested Cyber Criminals in Hyderabad : సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నట్లు సృష్టించి, నకిలీ ఐడీలతో అకౌంట్లు ఓపెన్​ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరెంట్ అకౌంట్ల ద్వారా రాజస్థాన్​ జోద్​పూర్ కేంద్రంగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

Police arrested cyber criminals
Police arrested cyber criminals

Police Arrested Cyber Criminals in Hyderabad : హైదరాబాద్​ నగరానికి వచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్న రాజస్థాన్​కు చెందిన నేరగాళ్ల ముఠాను సైబర్​ క్రైమ్​ పోలీసులు గుట్టు రట్టు చేశారు. తాజాగా ఈ సైబర్ మోసాగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి వచ్చి పలు వ్యాపారాలు చేస్తున్నట్లు సృష్టించి, నకిలీ ఐడీలతో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్​ నేరాల ద్వారా నిందితులు రూ.10 కోట్లకు పైగా సంపాదించినట్లు గుర్తించారు.

కరెంట్ అకౌంట్ల ద్వారా రాజస్థాన్ జోద్​పూర్​ కేంద్రంగా భారీగా సైబర్ నేరాలు(Cyber crime) చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిని రాజస్థాన్​కు చెందిన మంగీ లాల్, భజన్ లాల్, కమలేష్ కుమార్, ప్రకాష్ చంద్​లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై తెలంగాణలో 3 కేసులు, దేశవ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

పెట్టుబడుల పేరుతో భారీ మోసం
మరోవైపు పెట్టుబడులతో భారీ లాభాలు పొందొచ్చని బాధితుడిని మోసం చేసిన నలుగురు సైబర్ నేరగాళ్లపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు(police) కేసు నమోదు చేశారు. తిరుమలగిరికి చెందిన బాధితుడికి సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్‌ ద్వారా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో వల వేశారు. బాధితుడిని ఎయిర్‌లైన్స్‌ టికెట్‌ బుకింగ్ యాప్‌లో జాయిన్‌ చేసి, మూడు టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. బాధితుడు వారి సూచన మేరకు అలాగే చేశాడు. తర్వాత ఆ యాప్‌లో 3 కంటే ఎక్కువ చేసేటట్లుగా చేశారు.

భారీగా లాభాలు వస్తాయని నమ్మిన బాధితుడు రూ.71.61లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా పూజారి దామోదర్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ చేతన్, నున్న నరేంద్రబాబులను గుర్తించారు. వీరిపై దేశవ్యాప్తంగా 34 కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఫెడ్ఎక్స్ కొరియర్​ పేరుతో కాల్ - అవయవ పార్శిల్ వచ్చిందంటూ లక్షల్లో దోపిడీ - Cyber crime in hyderabad

వేర్వేరు కేసుల్లో సైబర్‌ నేరగాళ్ల అరెస్టు - విచారణలో విస్తుపోయే విషయాలు - cyber trading fraud accused arrest

స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల ఆశ చూపి - హైదరాబాద్​కు చెందిన వృద్ధుడికి రూ.5.98 కోట్లు టోకరా

ABOUT THE AUTHOR

...view details