తెలంగాణ

telangana

ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాల పేరిట ఎర - రూ.10లక్షలకు పైగా కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు - Cyber Crime in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 10:15 PM IST

Online Trading Fraud in Hyderabad : సైబర్‌ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్​లైన్​ ట్రేడింగ్​ పేరిట ఒకరు, రివార్డు పాయింట్ల పేరుతో మరొకరు సైబర్​ అటాక్​ గురై, రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్న ఘటనలు హైదరాబాద్​ నగరంలో వరుసగా చోటుచేసుకున్నాయి. ట్రేడింగ్​లో లాభాలు పొందవచ్చని సైబర్‌ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయినట్లు గమనించి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber Crime Helpline
Bank Reward Points Scam in Hyderabad

Online Trading Fraud in Hyderabad :సైబర్​ క్రైమ్స్​పై ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరోఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు-అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు(Cyber Threats) వేసిన వలకు ఎంతోమంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌ పేరిట పదిలక్షల రూపాయలు పైగా మోసపోయానని, హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజినీర్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు

ట్రేడింగ్​లో లాభాలు పొందవచ్చని సైబర్‌ నేరగాళ్లు, టెలిగ్రామ్‌లో బాధితుడుకి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతాలో రూ. 10 వేలు జమచేసి పెట్టుబడి పెట్టాలని సూచించారు. తద్వారా లాభాలు వచ్చేలా చేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. వాటి లాభాలు విత్‌డ్రా చేసుకునేందుకు లాభం ఎంత వచ్చిందో అంత మొత్తం ఇన్వెస్ట్‌(Investment) చేయాలని నేరగాళ్లు సూచించారు. దాంతో వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు రూ. 10,59,540 చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Cyber Crime in Hyderabad :అన్ని డబ్బులు చెల్లించిన తర్వాత మరిన్ని చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ధ్రువీకృత వెబ్‌సైట్లలో(Verified Websites) మాత్రమే లాభాల కోసం పెట్టుబడులు పెట్టాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత లింక్‌లు, వెబ్‌సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ తరహా మోసాలకు గురైతే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

Fake Reward Points Fraud in Hyderabad :మరోవైపు రివార్డు పాయింట్ల పేరుతో హైదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92లక్షలు కాజేశారు. యాక్సిస్‌ బ్యాంక్‌ రివార్డు పాయింట్ల పేరుతో మర్చంట్​కు ఓ లింక్‌ మెసేజ్‌ రూపంలో వచ్చింది. మోటార్‌ బీమా కోసం బ్యాంక్‌ పంపించిన లింక్‌గా(Bank Link) భావించిన అతను దాన్ని ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేశారు.

ఆ వెంటనే తన బ్యాంక్‌ ఖాతా నుంచి కొంత సొమ్ము డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత లింకులను క్లిక్‌ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే(Cyber Crime Helpline ) వెంటనే 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inలో రిపోర్ట్‌ చేయాలని కోరుతున్నారు.

సిక్స్ డేంజర్ డిజిట్స్- OTP విషయంలో ఈ జాగ్రత్తలు మస్ట్ - safety tips for otp detection

సైబర్ నేరగాళ్ల​​ నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details