తెలంగాణ

telangana

వంట ఆలస్యమైందని భార్యను చంపేసిన భర్త - ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? - MAN KILLS WIFE FOR COOKING LATE

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 11:59 AM IST

Updated : May 1, 2024, 12:10 PM IST

Husband Killed Wife For Delay in Cooking in Hyderabad : బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వంట విషయంలో భార్యాభర్తల మధ్య రాజుకున్న గొడవ ప్రాణాలు తీసే వరకు చేరింది. వంట ఆలస్యంగా చేసిందనే కోపంతో ఇటుక రాయి తీసుకుని భార్య తలపై కొట్టాడు ఆ భర్త. ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హైదరాబాద్​లో జరిగింది.

Man Kills Wife Over Delay Cooking Food
Husband Killed her Wife in Hyderabad

Husband Killed Wife in Hyderabad: ఎంతో అన్యోన్యంగా జీవించే ఆ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. రాగానే ఇక్కడ ఓ పనిలో కుదిరారు. ఇద్దరు పిల్లలను తమ సొంతూళ్లో వదిలేసి, నెలల పసికందును వెంట పెట్టుకుని భాగ్యనగరానికి వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భర్త భార్య తలపై ఇటుకరాయితో బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నెలల పసికందుతో పాటు మరో ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని వారైపోయారు. ఈ ఘటన నగరంలోని కూకట్​పల్లి సమీపంలోని ప్రగతినగర్​లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :మహారాష్ట్రకు చెందిన రవీనా దూబే(26), నవీన్​ దుర్వే దంపతులు ఈ నెల 26న భాగ్యనగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ప్రగతి నగర్​లోని ఓ కళాశాల వసతి గృహం సమీపంలో గుడిసెలో తాత్కాలికంగా నివాసమున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలను సొంతూరులోనే ఉంచి ఏడాది వయసున్న బాబుతో హైదరాబాద్​కు వచ్చారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చారు.

నవీన్ దుర్వే

ఇబ్రహీంపట్నంలో పరువు హత్య - ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను కొట్టి చంపిన తల్లి

Husband Killed His Wife Delay Preparing Dinner in Telangana : ఇంటికి తిరిగి వచ్చిన తరవాత వంట త్వరగా చేయమని నవీన్​ తన భార్యకు చెప్పాడు. కాసేపటి తరవాత మరికొంత తొందరపెట్టాడు. ఆమె కొంత ఆలస్యం చేసింది. ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త గుడిసె ఆవరణలో ఉన్న ఇటుక రాయిని తీసుకొని భార్య తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. రవీనా మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో ఉన్న వారి కుటుంబం, బంధువులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అప్పు తీర్చమన్నందుకు మహిళ తలపై కొట్టి హతమార్చాడు - నిజామాబాద్​లో దారుణం - Woman Murdered In nizamabad Dist

'మా ఫ్రెండ్​ చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం' - యువకుడిని హత్య చేసి ఇన్​స్టాలో సెల్ఫీ వీడియో - INSTA SELFIE VIDEO MURDER

Last Updated :May 1, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details