ETV Bharat / state

'మా ఫ్రెండ్​ చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం' - యువకుడిని హత్య చేసి ఇన్​స్టాలో సెల్ఫీ వీడియో - INSTA SELFIE VIDEO MURDER

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 1:56 PM IST

Pragathi Nagar murder case
Young Man Murder in Pragathi Nagar

Young Man Murder in Pragathi Nagar : పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Young Man Murder in Pragathi Nagar : మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్​స్టేషన్​ పరిధి ప్రగతి నగర్​లో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి, ఆపై బండరాయితో మోది చంపారు. హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్​ఆర్​ ​నగర్​లోని దాసారం బస్తీలో నివాసం ఉండే తేజస్​ అలియాస్​ సిద్ధూ (21) గత సంవత్సరం స్థానికంగా జరిగిన అరుణ్​ అనే యువకుడి హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అతడు, 2 నెలల క్రితం విడుదలయ్యాడు.

ఆ తర్వాత ఎస్​ఆర్​​ నగర్​ నుంచి ప్రగతినగర్​లోని బతుకమ్మ కుంటకు మకాం మార్చాడు. అక్కడ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి తేజస్​ తల్లి ఊరు వెళ్లింది. దాంతో ఒంటరిగా ఉన్న అతడు, తన స్నేహితులు మహేశ్​, శివప్ప, సమీర్​లను ఇంటికి పిలిపించుకున్నాడు. అందరూ కలిసి అర్ధరాత్రి దాటే దాకా మద్యం సేవించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బైక్​పై ఓ ముగ్గురు గుర్తు తెలియని యువకులు వచ్చి పని ఉందంటూ తేజస్​ను ప్రగతినగర్​లోని బతుకమ్మ ఘాట్​ వద్దకు తీసుకెళ్లారు.

ఇద్దరు చిన్నారుల దారుణ హత్య- ఇంట్లోకి వెళ్లి గొంతుకోసి పరార్​- ఎన్​కౌంటర్​లో నిందితుడి హతం

హత్య చేసి, ఇన్​స్టాలో పోస్టు పెట్టి : ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, తేజస్​పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. 11 చోట్ల కత్తి గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని బండరాయితో మోది హతమార్చారు. అంతటితో ఆగకుండా హత్య తర్వాత ఆ దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసి, ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేశారు. అరుణ్​ మర్డర్​కు ప్రతీకారం తీర్చుకున్నామంటూ ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం.

సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య

ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్​పల్లి ఏసీపీ కె. శ్రీనివాస రావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్​ యాదవ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలను రప్పించగా, అవి చుట్టుపక్కల తిరిగి ఆగిపోయాయి. అనంతరం తేజస్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మర్డర్​కు పాల్పడిన నిందితులుగా భావిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లారీతో తొక్కించి ఐదుగురి హత్య- ఘర్షణపై కేసు పెట్టేందుకు వెళ్తుండగానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.