తెలంగాణ

telangana

112ఏళ్ల క్రితం ఇదేరోజు 'టైటానిక్'లో మృతి- ఆమె పేరుతో భారత్​లో ఇప్పటికీ విద్యా 'దానం'! - Titanic Disaster Miss Annie story

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 2:31 PM IST

Titanic Disaster Miss Annie Story : టైటానిక్​ ఓడ సముద్రంలో మునిగిపోయి ఈ రోజుకి 112ఏళ్లు అవుతుంది. అయితే టైటానిక్​ ఓడ మునిగిన ఘటనకు, భారత్​కు ఓ సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

Titanic Disaster Miss Annie Story
Titanic Disaster Miss Annie Story

భారత్​లో మహిళా విద్యకు కృషి- టైటానిక్ ప్రమాదంలో మృతి- చనిపోతూ మరో ఇద్దరిని కాపాడిన అన్నీ ఫంక్

Titanic Disaster Miss Annie Story : భారత్​లో బాలికల విద్య కోసం కృషి చేసిన ఓ విదేశీ మహిళ టైటానిక్​ ప్రమాదంలో చనిపోయారు. చావు ఎదురుగా ఉన్నా కూడా తన లైఫ్​ జాకెట్​ను ఓ చిన్నారికి ఇచ్చి ప్రాణ త్యాగం చేశారు. ఆమె చనిపోయి వందేళ్లు దాటిపోయినా ఇంకా చత్తీస్​గఢ్ ప్రజలు ఆ మహిళ సేవలను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. మిస్​ అన్నీ క్లెమెర్ ఫంక్. టైటానిక్​ ఓడ సముద్రంలో మునిగి పోయి 112ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఆ విదేశీ మహిళ ఎవరు? భారత్​లో ఆమె చేసిన సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నీ ఫంక్ నిర్మించిన మోమోరియల్ స్కూల్

1874 ఏప్రిల్ 12న అమెరికాలో జన్మించిన మిస్​ యాని క్లెమెర్ ఫంక్​ 1906లో భారత్​కు వచ్చారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌గిర్ చంపాలో మహిళ విద్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా 1907లో అక్కడే ఓ మోమోరియల్ స్కూల్​ను సైతం స్థాపించారు. వారి కోసం ఓ వసతి గృహన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ స్కూల్​లో 17 మంది బాలికలు చదువుతున్నారు. తన తల్లి ఆరోగ్యం బాలేదని 1912 ఏప్రిల్ 6న ఫంక్​కు తెలిసింది. అప్పుడు ఆమె తన స్వస్థలం అమెరికాలోని పెన్సిల్వేనియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. యాని మొదట జాంజ్‌గిర్ చంపా నుంచి ముంబయి, అక్కడ నుంచి బ్రిటన్ వెళ్లారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లడానికి SS హెవాఫోడ్జ్ అనే ఓడ ఎక్కాల్సి ఉంది, కానీ ఆ రోజు బొగ్గు కార్మికుల సమ్మె కారణంగా ఆ నౌక క్యాన్సిల్ అయ్యింది. దీంతో 13 పౌండ్లు అదనంగా చెల్లించి టైటానిక్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు ఫంక్.

అన్నీ ఫంక్

మరణించే సమయంలో మానవత్వం
ఇక టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 10న బయలుదేరింది. యాని ఏప్రిల్ 12న ఓడలో పుట్టినరోజును జరుపుకున్నారు. ఓడ మునిగిపోతున్న సమయంలోనూ ఫంక్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మునిగిపోతున్న ఓడలో చిక్కుకున్న ఓ తల్లి, ఆమె బిడ్డకు తన ప్రాణాలను రక్షించే జాకెట్‌ను అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో యాని ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించే సమయానికి ఫంక్ వయస్సు 38 ఏళ్లు. ఫంక్​ చేసిన కృషికి జాంజ్‌ గిర్ చంపాలోని​ ప్రజలు విద్యాదేవతగా పిలుచుకుంటారు.

ఫంక్​ మోమోరియల్ స్కూల్​లో చదివిన విద్యార్థులు

జాంజ్‌ గిర్ చంపాలోని ఫంక్ ఏర్పాటు చేసిన మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ సరోజినీ సింగ్ ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. 'జాంజ్‌ గిర్‌ చంపాలోని ఓ అద్దె ఇంట్లో ఫంక్ మెమోరియల్ పాఠశాలను నడిపారు. ఆమె బాలికల కోసం ఒక హాస్టల్‌ను కూడా నిర్మించారు. మోమోరియల్ స్కూల్ 1960 వరకు నడిచింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పాఠశాల, హాస్టల్ ను మూసివేయాల్సి వచ్చింది. 1960 తర్వాత ఈ పాఠశాలను సొసైటీ నిర్వహిస్తోంది. 2007లో ఈ పాఠశాలకు మిస్ ఫంక్ స్కూల్ అని పేరు పెట్టారు. కానీ తర్వాత దాని పేరు మిస్ ఫంక్ గా మార్చారు. ఆమె మరణనంతరం యాని ప్రారంభించిన పనులు ఇతర మిషనరీలు పూర్తి చేశారు. ఇప్పటికీ ఆ మిషనరీలు విద్య, ఆరోగ్యం, ప్రజా సేవకే పనిచేస్తున్నాయి.' అని సరోజిని సింగ్​ తెలిపారు.

ఇక దేశంలో ఉల్లి కొరత ఉండదు! అన్ని సీజన్లలో సాగు చేసేలా 93కొత్త వంగడాల ఆవిష్కరణ - 93 varieties of onion

ఈ స్మార్ట్​వాచ్​తో ఫుల్​ బాడీ రిపోర్ట్!- డాక్టర్​కు, ఫ్యామిలీకి మెసేజ్​- ధర తక్కువే! - health monitoring watch for seniors

ABOUT THE AUTHOR

...view details