ఏటీఎం నగదు జమ చేస్తుండగా కత్తులతో బెదిరించి రూ.1.92 లక్షలు చోరీ

By

Published : Jun 10, 2022, 5:50 AM IST

thumbnail

ఏటీఎంలో నగదు జమ చేస్తున్న వ్యక్తి వద్ద రూ.1.92 లక్షలు దొంగతనం చేశారు ముగ్గురు ఆగంతుకులు. గుజరాత్​ సూరత్​కు చెందిన చందన్​కుమార్​ నగదు జమ చేసేందుకు జీఐడీసీలోని ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఏటీఎంలోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్​ఫోన్​ను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఏటీఎం సీసీటీవీలో నమోదయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.