కత్తి విన్యాసాలతో గిన్నిస్​ రికార్డ్​, ఒకే చోట వేలాది మంది కలిసి

By

Published : Aug 19, 2022, 2:22 PM IST

thumbnail

ఐదు వేల మంది రాజ్‌పుత్ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ అరుదైన సంఘటన గుజరాత్​లోని జామ్ నగర్​లో శుక్రవారం జరిగింది. చరిత్రాత్మక 'భుచార్ మోరీ మైదాన్' యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం.. అఖిల గుజరాత్ రాజ్‌పుత్ యువ సంఘ్​తోపాటు షహీద్ స్మారక ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 17 జిల్లాలకు చెందిన యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హకుభా జడేజాతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్రమంత్రి కీర్తి సింగ్ వాఘేలా హాజరయ్యారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పత్రాన్ని నిర్వాహకులకు అందించారు. 500 ఏళ్ల క్రితం జామ్​ నగర్​ జిల్లాలోని ధ్రోల్​ నగర్​కు రెండు కిలోమీటర్ల దూరంలో భుచార్​ మోరీ మైదానంలో అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వేల మంది ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.