Prathidhwani: అనుమతి లేకుండానే వ్యక్తిగత డేటా సేకరణ.. మరీ గోప్యత సంగతేంటి..!

By

Published : Nov 23, 2021, 10:05 PM IST

thumbnail

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు జేపీసీ ఆమోదం పొందింది. త్వరలో పార్లమెంట్ ఆమోదం కోసం సభ ముందుకు రానుంది. దేశభద్రత వంటి కీలకమైన సందర్భాల్లో అనుమతి లేకుండానే వ్యక్తుల సమాచారం సేకరించే అవకాశం ఈ బిల్లు ద్వారా కలుగుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభత్వం, నిఘా, దర్యాప్తు సంస్థలకు ఈ బిల్లు ఉపయోగపడనుంది. అయితే.. సామాజిక మాధ్యమాలు, ప్రైవేటు సంస్థలపై ఆంక్షలు విధించింది. తప్పుడు మార్గాల్లో డేటా సేకరిస్తే.. తీవ్రతను బట్టి జరిమానాలూ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసలు వ్యక్తులకు తమ వ్యక్తిగత డేటా విషయంలో ఎలాంటి హక్కులున్నాయి? ఎలాంటి పరిస్థితుల్లో ఈ హక్కులకు మినహాయింపు ఇచ్చారు? ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు సేకరించిన డేటాకు పూర్తి భద్రత ఉంటుందా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.