PRATHIDWANI: ఉపఎన్నికల ఫలితాలు ప్రస్తుత రాజకీయ సమీకరణాలను మార్చనున్నాయా..?
దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు రాజకీయ వేడిని సృష్టించాయి. తెలుగురాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఏపీ బద్వేలు స్థానాన్ని అధికార వైకాపా నిలబెట్టుకుంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఉప ఎన్నికల ఫలితాలు మిశ్రమ సంకేతాలను అందించాయి. ఈశాన్యంలో భాజపా తమకు తిరుగులేదంటే... హిమాచల్, రాజస్థాన్లో విజయాలతో కాంగ్రెస్ తిరిగి రేసులోకి వచ్చింది. బెంగాల్లో నాలుగుకు నాలుగు స్థానాలను గెలుచుకున్న దీదీ... తన జోరును కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు ఈ ఉపఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం? రానున్నరోజుల్లో రాజకీయ సమీకరణలను ఈ ఫలితాలు ఏ మేరకు నిర్దేశించనున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.