రైలు ఇంజిన్​కు వేలాడుతూ యువకుడి మృతదేహం- చాలా దూరం వెళ్లాక!!

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 8:21 AM IST

Updated : Nov 14, 2023, 8:58 PM IST

thumbnail

Young Man Body Hanging On Train Engine : రైలు ఇంజిన్​కు యువకుడి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని గమనించుకోకుండా ప్యాసింజర్​ ట్రైన్​ను చాలా దూరం తీసుకెళ్లాడు లోకోపైలట్. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కేకలు వేయటం వల్ల లోకోపైలట్..​ ట్రైన్​ను ఆపాడు. అనంతరం రైల్వే సిబ్బంది.. మృతదేహాన్ని తొలగించారు.

ఫరూఖాబాద్​ నుంచి శికోహాబాద్​ వెళ్తున్న ప్యాసింజర్​ ట్రైన్​ ఇంజిన్​కు మృతదేహం వేలాడుతూ ఉంది. మార్గమధ్యలో.. ట్రాక్​ దగ్గర ఉన్న కొందరు.. ఇంజిన్​కు డెడ్​బాడీ ఉండటం చూసి పెద్దగా కేకలు వేశారు. ఆ అరుపులను విన్న లోకోపైలట్​ రైలును ఆపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంజిన్​ నుంచి తొలగించి.. శికోహాబాద్​ స్టేషన్ సూపరింటెండెంట్​కు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. శవపరీక్షల నిమిత్తం జిల్లా ఆసుప్రతికి తరలించారు. మృతుడిని మైన్​పురి జిల్లాలోని నాగ్లా మదారి ప్రాంతానికి చెందిన సౌరవ్​ కుమార్​(26) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతదేహం ఇంజిన్​కు ఎలా వేలాడిందన్న విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. 

Last Updated : Nov 14, 2023, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.