వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​ పిచ్​ వెనుక ఓ 'రైతు'- ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది!

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 3:12 PM IST

thumbnail

World Cup Final 2023 Stadium Pitch : ఐసీసీ వరల్డ్ కప్ భారత్​-ఆస్ట్రేలియా​ ఫైనల్​ మ్యాచ్​ వేదికైన నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్​ను ప్రత్యేకమైన ఎర్ర మట్టితో రూపొందించారు. గుజరాత్​ నవ్​సారీ జిల్లా పత్రీ గ్రామంలోని ఓ రైతు పొలం నుంచి ఈ మట్టిని తీసుకొచ్చారు.

గతంలో అనేక అంతర్జాతీయ టోర్నమెంట్​లకు వేదికలైన స్టేడియంలలోని పిచ్​ల కోసం తమ పొలంలోని ఎర్ర మట్టినే ఉపయోగించారని చెబుతున్నారు రైతు అశోక్ దొరాజియా. టీమ్ ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

"ఇక్కడి ఎర్రమట్టితోనే పిచ్ చేశారు. ఇది నాకు గర్వకారణం. బరోడాలో టీ20 జరిగినప్పుడు కామెంటేటర్ కూడా పిచ్​ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఈ మట్టితో చేసిన పిచ్​పై ఆడి మన దేశ జట్టు గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది."

--అశోక్ దొరాజియా, రైతు

ఈ ఎర్ర మట్టి ఎంతో ప్రత్యేకమట. దీనితో పిచ్​లు తయారు చేస్తే త్వరగా పగుళ్లు రాకుండా.. ఎక్కువకాలం మన్నుతాయట.

"ఇంతకుముందు ఇక్కడ పెంకుల ఫ్యాక్టరీ ఉండేది. తర్వాత వ్యవసాయ భూమిగా మార్చుదామని చూశాం. కానీ ఎర్ర మట్టి వచ్చింది. క్రికెట్ వాళ్లు ఆ మట్టిని తీసుకెళ్లి, పిచ్​ తయారీకి వాడారు. అప్పుడు దీని ప్రత్యేకత ఏంటో తెలిసింది. ఎర్ర మట్టి ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఇది ప్రత్యేకం. అందుకే మనం వరల్డ్ కప్ గెలుస్తున్నామని నేను ధీమాగా చెప్పగలను."

--అశోక్ దొరాజియా, రైతు

ఫైనల్​ మ్యాచ్​ పిచ్ తయారీకి ఉపయోగించిన ఎర్ర మట్టి.. మరెక్కడా దొరకదని చెబుతున్నారు అశోక్ దొరాజియా.

విజేతకు రూ.32 కోట్లు- రన్నరప్​కు రూ.16 కోట్లు- వరల్డ్​ కప్​ ప్రైజ్​ మనీ వివరాలు ఇవే!

12 ఫైనల్స్​ 6 శతకాలు - వరల్డ్​కప్​ హిస్టరీలో లాస్ట్ మ్యాచ్​ సెంచరీల హీరోలు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.