భూకంపంతో ఊగిపోయిన భవనం.. ప్రాణాలకు తెగించి శిశువులను కాపాడిన నర్సులు

By

Published : Feb 12, 2023, 6:11 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

తుర్కియేలో భూకంపం వచ్చిన సమయంలో ఇద్దరు నర్సులు తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడిన వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం రిక్టర్​స్కేల్​పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంప సమయంలో గజియాన్​తెప్​​లోని ఆస్పత్రి భవనం ఊగిపోయింది. దీనిని గమనించిన నర్సులు.. అక్కడి నుంచి పారిపోకుండా ఇంక్యుబెటర్​లో ఉన్న శిశువులు పడిపోకుండా కాపాడారు. వీరిని దెవ్లెట్​ నిజాం, గజ్వాల్​ కాలిస్కన్​గా గుర్తించారు. ఈ వీడియోను తుర్కియే నేత ఫత్మా సహీన్​ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి శిశువులను కాపాడిన నర్సులను నెటిజన్లు అభినందిస్తున్నారు.  

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.