'మా సమస్యలు పట్టవు కానీ మా ఓట్లు మీకు కావాలా?'

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 4:42 PM IST

thumbnail

Voter Innovative Protest in Yadadri : రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు చెప్పులు అరిగేలా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో ఓ ఓటరు చేసిన వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంపత్ అనే వ్యక్తి.. తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ అభ్యర్థులు ఓటు అడిగేందుకు, తమ ఇంటికి రావొద్దని ఓ ప్లెక్సీని తన ఇంటి గుమ్మానికి ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

మున్సిపాలిటీ కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా.. పురపాలక కార్యాలయం చుట్టూ తిరిగినా తన ఇంటి వద్ద డ్రైనేజీ సౌకర్యం కల్పించడం లేదని సంపత్ వాపోయాడు. చివరకు ఏమి చేయలేక తన నిరసనను ఈ విధంగా తెలిపానని వివరించాడు. తమ పిల్లలతో సహా ఇంటిల్లిపాది ఆ మురికి కాలువు కారణంగా దోమల మోత, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నట్లు.. ఆర్థికంగా నష్టపోతున్నట్లు వివరించాడు. మా బాధలు పట్టని మీకు.. మా ఓటు అడిగే అర్హత లేదని నిరసన వ్యక్తంచేశాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.