భక్త జనసంద్రమైన యాదాద్రి దేవాలయం - ఉచిత దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 1:28 PM IST

thumbnail
భక్త జనసంద్రమైన యాదాద్రి దేవాలయం- ఉచిత దర్శనానికి 3 గంటల సమయం (ETV Bharat)

Devotees Rush in Yadadri Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున నుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. 

Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ఆలయంలో స్వామి వారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణంలో భక్తులు సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి కాలం  తాగు నీటికి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశారు. నీడ కోసం పందిర్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.