కదులుతున్న రైలులో దొంగతనం చేస్తూ దొరికిన దొంగ- కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 9:54 PM IST

Updated : Jan 17, 2024, 10:49 PM IST

thumbnail

Thief Hanging To Moving Train Window : రైలులోని వ్యక్తి పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ దొంగను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు తోటి ప్రయాణికులు. అనంతరం అతడిని కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. ఈ ఘటన బిహార్​ భాగల్​పుర్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్​లో జరిగింది. అతడి రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు అతడిని అలానే పట్టుకున్నారు. ఈ క్రమంలో రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయగా ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి.​ ఇదే విషయమై భాగల్​పుర్​ రైల్వే ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్​ రణధీర్‌ కుమార్​ను సంప్రదించగా, అటువంటి కేసు ఏమీ తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. జీఆర్‌పీతో మాట్లాడిన అనంతరం కేసును విచారిస్తామని తెలిపారు.

Last Updated : Jan 17, 2024, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.