"పల్లె.. పల్లెకి వస్తున్నాడమ్మో..".. లోకేశ్​ యువగళం పాదయాత్రపై స్పెషల్​ సాంగ్​

By

Published : Apr 1, 2023, 1:52 PM IST

thumbnail

SONG ON LOKESH YUVAGALAM: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. నేటికీ 57వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్​కు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా వింటున్న లోకేశ్​.. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. పాదయాత్రకు మహిళలు, చిన్నారులు తరలివస్తున్నారు. హారతులు, గజమాలలతో జననీరాజనాలు పడుతున్నారు. తాజాగా లోకేశ్‌ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత కేశినేని చిన్ని ప్రత్యేక గీతం రూపొందించారు. ఈ పాటను లోకేశ్‌ క్యాంప్ సైట్ ప్యాదిండి వద్ద విడుదల చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్‌ కొత్త నాయకుడిగా ప్రజల ముందుకు వస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ పాటను లోకేశ్​ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణికి అంకితం చేస్తున్నామని చిన్ని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.