తమిళనాడులో వరదల బీభత్సం- జనజీవనం అస్తవ్యస్తం,హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 8:46 AM IST

Updated : Dec 21, 2023, 9:07 AM IST

thumbnail

Tamil Nadu Flood 2023 : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు వరద నీరు చేరింది. వరదలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎన్డీఆర్​ఎఫ్, కోస్ట్​గార్డ్ సిబ్బంది. హెలికాఫ్టర్​ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందించారు. 
దక్షిణ తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇండియన్ కోస్ట్​గార్డ్ పడవతో వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా 600 కేజీల ఆహార పొట్లాలను అందించారు అధికారులు. మరోవైపు కోస్ట్​గార్డ్ ఈస్ట్ రీజియన్ కమాండర్ జనరల్ ఐజీ డొన్ని మైఖెల్ డిసెంబర్ 20న సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

మరోవైపు, తమిళనాడు పశుసంవర్థకశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్, ఆయన సిబ్బంది వరదనీటిలో చిక్కుకున్నారు. ఆయన స్వగ్రామమైన తాండుపట్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మెసేజ్​ ద్వారా తన పరిస్థితిని ఆయన బంధువులకు తెలియజేశారు. దీంతో తిరునల్వేలి డీసీపీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

Last Updated : Dec 21, 2023, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.