Nalgonda Accident Today : నీళ్ల ట్యాంకర్​ను ఢీకొట్టిన RTC బస్సు.. అందులో 43 మంది ప్రయాణికులు

By

Published : Jun 9, 2023, 6:42 PM IST

thumbnail

RTC Bus Accident in Nalgonda : రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మృత్యువాతపడుతున్నారు. మరికొందరు గాయాల పాలై.. ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం ఏపీలింగోటం శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్​పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు.. హైదరాబాద్​ నుంచి కోదాడకు వెళ్తుండగా ఏపీ లింగోటం శివారు వద్ద వాటర్​ ట్యాంకర్​ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.