కదలకుండా ఎంతో బుద్ధిగా రాఖీ కట్టించుకున్న చిరుత

By

Published : Aug 13, 2022, 1:32 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

రాజస్థాన్ రాజ్​సమంద్ జిల్లాలో ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. రోడ్డుపై వెళ్తున్న వణ్యప్రాణికి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే, ఆ చిరుతకు గాయాలు అయ్యాయి. అందువల్ల అది మెల్లిగా రహదారి పక్కన నడుస్తూ వెళ్తోంది. దీంతో చిరుత గురించి అటవీ అధికారులకు నరానా గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి చిరుతను జాగ్రత్తగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిరుత కోలుకోవాలని ప్రార్థిస్తూ ఓ మహిళ రాఖీ కట్టింది. మనుషులను భయపెట్టకుండా, తాను భయపడకుండా చిరుత రాఖీ కట్టించుకోవడం విశేషం.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.