రెండు లారీలు ఢీ.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవ దహనం

By

Published : Apr 24, 2023, 11:29 AM IST

thumbnail

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరొకరికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం బాఢ్​మేర్​​ జిల్లాలోని గూడమలాని పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేకువజామున జరిగింది.  

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బికానీర్​ నుంచి వస్తున్న ఓ లారీ.. లోడ్​తో ఎదురుగా వెళ్తున్న వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్​ అయ్యింది. వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.