బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 2:18 PM IST

thumbnail

Nagole Road accident Today : హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్​లో జరిగిన ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి చెందారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్ చెందిన తండ్రి కుమార్ (40), కుమారుడు ప్రదీప్ (8)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నాగోల్​లో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో టిప్పర్ లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు వాహనంపై వెళ్తున్న తండ్రీకుమారులు సజీవదహనమయ్యారు. మరోవైపు టిప్పర్ లారీ కూడా దగ్ధమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్​ డ్రైవర పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తండ్రీకుమారుడి మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.