ట్రైన్​ ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య.. శవాన్ని 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన రైలు

By

Published : Feb 21, 2023, 8:06 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహాలో దారుణ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని 5 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది రైలు. దీంతో అతడి రెండు కాళ్లు.. మోకాళ్ల వరకు తెగిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని ఇంజిన్​ను నుంచి తొలగించారు. మృతుడిని దెహత్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని పచఖోరా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్​గా గుర్తించారు.

గుర్వీందర్ సింగ్​ అమ్రోహాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా.. ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సోమవారం పనికి వెళ్తుండగా.. భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గుర్వీందర్ సింగ్​.. కైలసా రైల్వే స్టేషన్​కు వెళ్లి ట్రైన్​ ముందు దూకాడు. అతడి మృతదేహం ఇంజిన్​లో ఇరుక్కుపోగా.. సుమారు 5 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది రైలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.