కారు బానెట్​పై పోలీసును 20 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్

By

Published : Apr 16, 2023, 12:38 PM IST

thumbnail

ట్రాఫిక్ పోలీసును కారు బానెట్​పై 20 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర నవీ ముంబయిలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సేవించారన్న అనుమానంతో వాశీ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు కారును అడ్డగించే ప్రయత్నం చేశారు.

కోపర్​ఖెరాణె-వాశీ మార్గంలో బందోబస్తు నిర్వహిస్తున్న సిద్ధేశ్వర్ మాలి(37) అనే ట్రాఫిక్ పోలీసు.. మరో పోలీసుతో కలిసి కారును అడ్డుకున్నారు. ఆ కారు డ్రైవర్ డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానంతో వారిని ఆపారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా.. కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ముందున్న సిద్ధేశ్వర్ మాలి కారు బానెట్​పై పడిపోయారు. డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. కారును గట్టిగా పట్టుకొని ఉన్న ట్రాఫిక్ పోలీసు.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కింద పడిపోయారు. ఇతర పోలీసులు ఆ కారును వెంబడించి.. డ్రైవర్​ను పట్టుకున్నారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అతడిపై మూడు ఐపీసీ సెక్షన్లు సహా మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.