Kodi Katthi Case Trial Adjourned కోడికత్తి కేసులో జగన్ హాజరుపై ఎన్‌ఐఏ కోర్టులో వాదోపవాదాలు.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 4:06 PM IST

Updated : Sep 20, 2023, 6:06 PM IST

thumbnail

Kodi Katthi Case Trial Adjourned: విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ-ఏడీజే కోర్టులో నేడు కోడి కత్తి కేసుపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలను విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. అనంతరం జనుపల్లి శ్రీనివాసరావు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై రేపు వాదనలు వింటామని జడ్జి చెప్పినట్లు..నిందితుడి తరఫు న్యాయవాది సలీం తెలిపారు.

Advocate Salim Comments: విచారణ అనంతరం నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడుతూ..''కోడి కత్తి కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై జడ్జి రేపు వాదనలు వింటామన్నారు. సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలి. విశాఖ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీ నాయకులపై కూడా కేసు నమోదైంది. కానీ, ఆ కేసుపై కోర్టులో విచారణ జరగటం లేదు. న్యాయవాదిగా.. వైసీపీ నాయకులపై నమోదైన కేసుపై కూడా కోర్టులో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను. జగన్‌ హాజరుకావాలి లేనిపక్షంలో ఎన్‌వోసీ ఇవ్వాలని కోరుతున్నాను. శ్రీనివాస్‌కు ఇవాళ బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరాను. ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్ నేరుగా కోర్టుకు హాజరు కాలేనంటున్నారు. వీడియో మోడ్ ద్వారా విచారించాలని కోర్టుకు అభ్యర్థించాను.'' అని న్యాయవాది సలీం అన్నారు. 

Dalit Community Leader Comments: కోడికత్తి కేసుపై దళిత సంఘ నేత బూసి వెంకటరావు మాట్లాడుతూ..''నిందితుడు దళితుడు కావడం వల్ల ఇబ్బంది పెడుతున్నారు. సుమారు ఐదు ఏళ్ల నుంచి కోర్ట్​కి హాజరుకావడానికి జగన్ తాత్సరం చేస్తున్నారు. మాకు న్యాయస్థానాలు మీద పూర్తి నమ్మకం ఉంది. జనుపల్లి శ్రీనివాస్​కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాము.'' అని ఆయన అన్నారు.

Last Updated : Sep 20, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.