Bride Attends Exam After Marriage : ఉదయం ప్రేమ పెళ్లి.. మధ్యాహ్నం డిగ్రీ ఎగ్జామ్.. బైక్​పై కాలేజ్​కు వెళ్లిన వధూవరులు

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:10 AM IST

thumbnail

Karnataka Bride Attends Exam After Marriage : ప్రేమ పరీక్షలో పాసై, పెళ్లి చేసుకున్న ఓ యువతి.. అదే రోజున డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్​ కూడా రాసింది. వరుడి బైక్​పైనే ఎగ్జామ్ సెంటర్​కు వెళ్లి.. పెళ్లి దుస్తుల్లోనే బీఏ ఎకనామిక్స్ పరీక్ష రాసి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం జరిగింది.

రెండేళ్ల ప్రేమ..
శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్​కు చెందిన సత్యవతి.. కమలా నెహ్రూ కళాశాలలో బీఏ చదువుతోంది. చెన్నైకు చెందిన ఫ్రాన్సిస్​తో రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయమైంది. తర్వాత వారి పరిచయం.. ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పిన సత్యవతి, ఫ్రాన్సిస్.. అందరినీ పెళ్లికి ఒప్పించారు. ఆదివారం వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే.. అదే రోజున సత్యవతికి బీఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ పరీక్ష కూడా ఉంది.

ఆదివారం ఉదయం శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్​లో సత్యవతి, ఫ్రాన్సిస్ పెళ్లి జరిగింది. మధ్యాహ్నం ఫ్రాన్సిస్.. తన భార్యను బైక్​పై ఎక్కించుకుని ఎగ్జామ్ సెంటర్​కు తీసుకెళ్లాడు. వివాహ దుస్తుల్లోనే పరీక్ష రాసేందుకు వచ్చిన సత్యవతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.