'ఈ నెల 5న జేఎన్​టీయూహెచ్​ స్నాతకోత్సవం - ఇస్రో ఛైర్మన్​కు డాక్టరేట్​ ప్రదానం'

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 7:01 PM IST

Updated : Jan 3, 2024, 7:07 PM IST

thumbnail

JNTUH Convocation Ceremony 2024 : జేఎన్​టీయూహెచ్ స్నాతకోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహ రెడ్డి తెలిపారు. ఈరోజు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్​టీయూహెచ్ నిర్వహించే స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్​కు (ISRO Chairman Dr. Somanath) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని తెలిపారు. అలాగే వివిధ విభాగాలలో విద్యను పూర్తి చేసుకున్న 88,226 విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. 

JNTUH Graduation Ceremony 2024 : ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) హాజరై డిగ్రీ పట్టాలతో పాటు విద్యా సంవత్సరంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 54 బంగారు పతకాలు అందజేస్తారని తెలిపారు. యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన జాబ్ మేళాలు, వివిధ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఎంవోయూ(MOU)లు, ప్రవేశపెట్టిన నూతన కోర్సుల వివరాలను ఆయన వెల్లడించారు.

Last Updated : Jan 3, 2024, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.