అదుపుతప్పి కారును ఢీకొట్టిన బస్సు- ఒకరు మృతి, పలు వాహనాలు తుక్కుతుక్కు!

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 6:31 PM IST

thumbnail

DTC Bus Accident Today : దిల్లీలోని రోహిణి ఏరియాలో ఓ ప్రభుత్వ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఓ బస్సు.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు చెప్పారు. కారును ఢీకొన్న తర్వాత కూడా బస్సు వేగం తగ్గకపోవడం వల్ల అది అదుపు తప్పి ఓ ఆటోను ఢీ కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న 9 ద్విచక్రవాహనాలను ఢీకొట్టగా అవన్నీ తుక్కుతుక్కు అయ్యాయి. 

మూర్చ వల్లే ప్రమాదామా!
Delhi Bus Accident News Today : ప్రయాణికులను దించిన అనంతరం డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, డ్రైవర్​కు మూర్చ రావడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్​కు మూర్చ రావడం వల్లే ప్రమాదం జరిగిందా? లేదా మద్యం మత్తులో జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.