డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరుతో వసూళ్లు - ఇంటికి రూ.1000 చొప్పున రూ.లక్ష జేబులో వేసుకున్న ప్రతిపక్ష నేత

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 4:59 PM IST

thumbnail

Double Bedroom Houses Issue in Kamareddy : డబుల్​ బెడ్​ రూం(2BHK Housing Scheme)​ల వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 22వ వార్డులోని డ్రైవర్స్​ కాలనీలో డబుల్​ బెడ్​ రూం​లకు సంబంధించి పట్టాతో పాటు విద్యుత్​ కనెక్షన్​ ఇప్పిస్తానని స్థానిక బీఆర్​ఎస్​ నాయకుడు ఆసిఫ్​ ఇంటికి రూ.1000 చొప్పున లక్ష రూపాయల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. డబ్బులు వసూలు చేస్తున్నాడని అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

Double Bedroom Houses Protest at Kamareddy : డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు సంబంధించి పట్టాతో పాటు విద్యుత్​ కనెక్షన్​ ఇప్పిస్తామని స్థానిక కౌన్సిలర్​ అనుచరుడు ఆసిఫ్​ ఒక్కొక్క ఇంటి నుంచి రూ.1000 చొప్పున లక్ష రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఇలా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహించారు. డబుల్​ బెడ్​ రూం ఇళ్లు కేటాయించి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇలా డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.