కారులో మంటలు.. కాన్వాయ్​ ఆపి సీఎం పరామర్శ.. ఆదుకుంటానని హామీ!

By

Published : Sep 13, 2022, 12:31 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

మహారాష్ట్ర ముంబయి వెస్ట్రన్ ఎక్స్​ప్రెస్ హైవేపై వెళ్తున్న ఓ లగ్జరీ కారులో అకస్మికంగా మంటలు వ్యాపించాయి. అదేసమయంలో అటుగా వెళ్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే.. మంటల్లో కాలిపోతున్న కారును చూసి తన కాన్వాయ్​ను ఆపించారు. అనంతరం, మంటల్లో చిక్కుకున్న కారు డ్రైవర్​ విక్రాంత్ శిందేతో మాట్లాడారు. మంటల వద్దకు వెళ్లొద్దని.. ప్రాణమే ముఖ్యమని సీఎం శిందే తనతో అన్నారని విక్రాంత్ తెలిపాడు. సాయం చేస్తానని సీఎం శిందే హామీ ఇచ్చారని వెల్లడించాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లను తెచ్చి.. మంటలను అదుపులోకి తెచ్చారు. సీఎం శిందే.. కారు డ్రైవర్​తో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.