Buildings Collapse In Kullu : హిమాచల్​లో వర్ష బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 12:48 PM IST

thumbnail

Buildings Collapse In Kullu Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లూలో కొండచరియలు విరిగిపడి అనేక సంఖ్యలో నివాస భవనాలు నేలమట్టం అయ్యాయి. క్షణాల్లోనే కులు లోయలోని ప్రభావిత ప్రాంతమంతా.. భయానకంగా తయారైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని సమాచారం. కులులోని అన్నీ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షణ కాలంలో జరిగిన ఊహకందని విధ్వంసంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Himachal Pradesh Landslide : కుల్లూలో కుప్పకూలిన 8 భవనాలు సురక్షితం కావని ఐదారు రోజుల క్రితమే అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు ఈ భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తించి స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ భవనాల్లో దుకాణాలు, బ్యాంకులు ఇతర నివాసాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం అన్ని భవనాలు ఒకదాని తర్వాత మరొకటి నేలమట్టం అవడం వల్ల భారీగా ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతను చూసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ఇతర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

Himachal Pradesh Death Toll : హిమాచల్​ ప్రదేశ్​ భారీ వర్షాల కారణంగా తలెత్తిన ప్రమాదాలకు ఈ ఒక్క నెలలోనే 120 మంది మృత్యువాత పడగా.. ఈ సీజన్‌ మొదలైన జూన్ 24 నుంచి 238 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మొత్తం 10వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.