Live Video : అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం.. పడవ బోల్తా పడి మామాఅల్లుళ్లు మృతి

By

Published : Jun 22, 2023, 11:07 AM IST

thumbnail

Boat Capsized In Kerala : కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్న చిన్న పడవ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మామఅల్లుళ్లు మృతిచెందారు. మిగతా నలుగురిని అగ్నిమాపక దళం కాపాడి ఆస్పత్రికి తరలించింది. మృతులను పుత్తంతర శరత్​ (33), అతడి మేనల్లుడు ఇవాన్ (4)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం జరిగింది.  

ఇదీ జరిగింది.. కొట్టాయం జిల్లా వాయీకమ్ మండలం సమీపంలోని ఉదయపురానికి చెందిన శరత్​.. తన తండ్రి, తల్లి, సోదరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి చిన్న పడవలో అంత్యక్రియలకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న సమయంలో బోటుకు రంధ్రం పడి.. నీళ్లు పడవలోకి వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో పడవ వాయీకమ్​ మండలం తలయాజం గ్రామం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సహాయక బృందం నలుగురిని రక్షించింది. ఇవాన్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషయంగా ఉన్న శరత్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరత్​ మృతిచెందాడు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.