మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ప్రొటోకాల్ వివాదం
Published : Dec 31, 2023, 11:24 AM IST
Argument Between Minister Konda Surekha And Palla Rajeshwar : శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జాతర ఏర్పాట్ల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్షా సమావేశంలో మంత్రి కాంగ్రెస్ నాయకులను స్టేజీ మీదకు పిలవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా, సిద్దిపేటలో సమావేశం పెట్టడం విడ్డూరమన్నారు.
Arrangements For Sri Komaravelli Mallikarjuna Swamy Fair : కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజీ మీదకు పిలవడం చాలా దురదృష్టకరమన్నారు. శ్రీ మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశం హోటల్లలో పెట్టలేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెళ్లిపోమ్మనడం విడ్డూరంగా ఉందన్నారు.