నీలగిరి కొండల్లో నల్లని జంతువు... ఏంటది?
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8386526-388-8386526-1597201670752.jpg)
నీలగిరి కొండల్లో ఓ అరుదైన జంతువు కనువిందు చేసింది. కోయంబత్తూరు ప్రాంతంలో ఈ జంతువు కెమెరా కంటపడింది. తొలుత బ్లాక్ పాంథర్ అనుకున్నా... తర్వాత అది నీలగిరి మార్టెన్ అని తెలిసింది. భారత్లో కనిపించే ఏకైక మార్టెన్ జాతి జంతువు ఇది. నీలగిరి కొండలు, పశ్చిమ కనుమల్లోని పలు ప్రాంతాల్లో ఈ జంతువు కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.