లైవ్ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు
ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 7న సంభవించిన జలప్రళయం తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జోషిమఠ్ సమీపంలోని తపోవన్ ప్రాంతంలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఉంది. వరద పోటెత్తే సమయంలో కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. వారు వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.