చుట్టూ వరద నీరు.. చెట్టుకొమ్మపై వ్యక్తి.. చివరకు...

By

Published : Sep 15, 2021, 2:38 PM IST

thumbnail

వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక శాఖ(Fire Department) సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన ఒడిశా నయాగఢ్​ జిల్లాలో(Odisha Nayagarh News) జరిగింది. నువాసాహస్​పుర్​ గ్రామానికి చెందిన కిశోర్​ చంద్ర ప్రధాన్​.. కుసుమీ నదిలో(Kusumi River) చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే.. ఆకస్మాత్తుగా ఆ నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో కిశోర్​ స్నేహితులు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, కిశోర్​ అక్కడే చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మామిడి చెట్టు కొమ్మపై కూర్చొని ఉండిపోయాడు. అనంతరం... అతని స్నేహితులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. అతణ్ని రక్షించి, ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.