పట్టపగలే కత్తితో బెదిరించి బంగారం చోరీ

By

Published : Dec 24, 2021, 4:32 PM IST

thumbnail

Jewellery Theft: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. హెల్మెట్​ ధరించి ఓ జువెలరీ షాపులోకి చొరబడ్డ దుండగుడు చోరీ చేశాడు. యజమానిని కత్తితో బెదిరించి 25 గ్రాముల గోల్డ్​ చైన్​ దోచుకెళ్లాడు. కేరళ కొల్లంలోని మూన్నంకుట్టి జంక్షన్​లో డిసెంబర్​ 23న మధ్యాహ్నం జరిగిందీ ఘటన. సీసీటీవీలో సంబంధిత దృశ్యాలు నమోదయ్యాయి. యజమాని అతడిని ఛేదించే క్రమంలో.. దుండగుడి చేతిలో కత్తి పడిపోయింది. దొంగ కింద పడినా.. వెంటనే లేచి పరిగెత్తి తప్పించుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి బైక్​పై పారిపోయాడని తెలిపిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.