లైవ్​ వీడియో: సిలిండర్​ పేలి అగ్నికి ఆహుతి

By

Published : Dec 15, 2020, 6:29 PM IST

thumbnail

తమిళనాడులోని ఓ టీ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ షాపు యజమాని మృతిచెందాడు. అతడిని కేరళకు చెందిన మోహన్​గా గుర్తించారు.​ చెన్నైలోని కిండి మసీదు కాలనీలో ఓ టీ షాపు నిర్వహిస్తూ జీవితం సాగిస్తున్న అతను.. రోజూలానే సోమవారం ఉదయం తన దుకాణాన్ని తెరిచి, టీ తయారు చేసేందుకు పొయ్యి వెలిగించాడు. అంతలోనే గ్యాస్​ లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోహన్​.. మంటలు అంటుకున్న శరీరంతో దుకాణం నుంచి బయటకు పరుగులు తీశాడు. అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి, అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతను మంగళవారం మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.